Breaking : టీటీడీ ఉద్యోగులకు రాయితీపై ఎలక్ట్రిక్ వాహనాలు

-

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అంతేకాదు, తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు రాయితీపై ఎలక్ట్రిక్ వాహనాలు అందిస్తామని తెలిపారు.

దాతలు టీటీడీకి 100 ఎలక్ట్రిక్ వాహనాలను విరాళంగా ఇచ్చారని వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి. తిరుపతిలోని అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల వాహనాల పార్కింగ్ కోసం రూ.54 లక్షలతో పార్కింగ్ షెడ్ నిర్మించగా, ఆ షెడ్ ను వైవీ సుబ్బారెడ్డి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వివరాలు తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. ఇదిలా ఉంటే.. నవంబర్ 1 నుంచి సర్వదర్శనం, ఎస్ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తామని, డిసెంబర్ 1 నుంచి బ్రేక్ దర్శనంలో టికెట్ల సమయంలోనూ మార్పులు చేశామని వాటిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. టీటీడీ ఉద్యోగుల సంక్షేమం గురించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మా రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు పొకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news