చంద్రబాబు పిచ్చి పట్టుకుంది : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

-

మరోసారి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ రాజధాని కావడం కొన్ని పత్రికలకు ఇష్టం లేదని అందుకే తప్పుడు వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు. మూడు రాజధానులే వైసీపీ ప్రభుత్వ విధానమని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. ఈనాడు పత్రికకు టీడీపీ అధినేత చంద్రబాబు పిచ్చి పట్టుకుందని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి. విశాఖ భూకబ్జాలకు సంబంధించి గతంలో సిట్ వేసింది చంద్రబాబు హయాంలోనే కదా అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

Chittoor: Minister Peddireddy Ramachandra Reddy asks MLAs, MPs to work for  curbing virus spread

మీరు రాసే తప్పుడు వార్తలతో చంద్రబాబు తలరాతను మార్చలేరని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. విశాఖలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. విశాఖలోని రిషికొండకు టీడీపీ నేతలు వెళ్తే ఉత్తరాంధ్రను రక్షించినట్టు అవుతుందా అని ప్రశ్నించారు మంత్రి పెద్దిరెడ్డి. అమరావతి రైతులు పాదయాత్రను మధ్యలోనే ఎందుకు ఆపేశారో అర్థం కావడం లేదని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. రిషికొండ నిషేధిత ప్రాంతమా అన్న ప్రశ్నకు కూడా పెద్దిరెడ్డి సమాధానం చెప్పలేదు. ఇదే విధంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానాలు దాట వేశారు. రాయలసీమలో ఎవరూ పాలనా రాజధాని కోరుకోవడం లేదని తెలిపారు. మూడు రాజధానులు తమ సీఎం అభిమతమని.. నాయకులందరూ పాటిస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news