నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-4 మెయిన్ ప్రాథమిక కీ విడుదల

-

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్-4 మెయిన్ ప్రాథమిక కీ విడుదలైంది. రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో 640 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఈనెల 4న మెయిన్ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రాథమిక కీని APPSC వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 7 నుంచి 9 వరకు తెలియజేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం ప్రాథమిక పరీక్ష సమాధానాల ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.

 

ఆన్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్ష ప్రాథమిక కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్‌ 7 నుంచి 9వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చని అభ్యర్థులకు సూచించింది. పోస్టు, వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌, ఫోన్‌, వ్యక్తిగతంగా సమర్పించడం తదితర రూపాల్లో అభ్యంతరాలను స్వీకరించబోమని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం appsc.ap.gov.in వెబ్సైట్ ను సందర్శించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news