జగన్ కీలక నిర్ణయం.. పేపర్ కొనేందుకు సచివాలయ ఉద్యోగులకు డబ్బులు

-

ఏపీ సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. సచివాలయ ఉద్యోగులు పేపర్ కొనుగోలు చేసేందుకు ప్రతి నెల 200 రూపాయలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలపై వారికి అవగాహన కోసం విస్తృత సర్కులేషన్ కలిగిన పేపర్ అవసరమని… నాలుగు నెలలకు గాను, ఏకంగా 10.44 కోట్లు కేటాయించింది జగన్ ప్రభుత్వం. కాగా ఇప్పటికే 2.61 లక్షల మంది వాలంటీర్లకు పేపర్ కొనుగోలుకు ప్రభుత్వం 200 రూపాయలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజా నిర్ణయంతో ప్రతినెల 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులకు పేపర్ కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేయనుంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news