నేడు బీజేపీలో చేరనున్న హార్దిక్ పటేల్

-

మాజీ కాంగ్రెస్ నేత, పాటీదార్ ఉద్యమ నాయకులు హార్దిక్ పటేల్  ఈ రోజు బీజేపీలో చేరనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఈయన ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జూన్ 2న బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈరోజు బీజేపీ చేరుతున్న తరుణంలో ఆయన ట్వీట్ చేశారు. ‘‘ ఈ రోజు నుంచి నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నాను. దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వలో పనిచేయబోతున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు.

hardik-patel
 

గుజరాత్ ఎన్నికల ముందు హర్దిక్ పటేల్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీపై విరుచుకుపడుతున్నారు హార్దిక్ పటేల్. రాముడిపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. శ్రీరాముడితో కాంగ్రెస్ పార్టీకి ఏం సమస్య అంటూ ప్రశ్నించారు. హిందువుల మనోభావాలకు కాంగ్రెస్ ఎప్పుడూ విలువ ఇవ్వలేదని విమర్శించారు. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి హార్దిక్ పటేల్ చేరిక మరింత కలిసి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news