ఆ చాక్లెట్ల కోసం నది ద్వారా సరిహద్దు దాటి భారత్ కు వచ్చాడు.. కానీ

-

టేస్టీ చాక్టెట్స్ అంటే ముందు స్థానంలో ఉండేది బ్రెజిల్.. ఇప్పుడు మన భారత్ తో కూడా డార్క్ చాక్లెట్స్ చాలా టేస్టీగా తయారు చేస్తున్నారు. ఈ చాక్లెట్స్ కు.. మన దగ్గరే కాదు.. విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉంటున్నారు. పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో డార్క్ చాక్లెట్స్ ఉన్నప్పట్టికీ.. ఇండియాలో చేసేవే ఓ కుర్రాడికి బాగా నచ్చాయి. వాటిని తినాలనే కోరిక మనోడికి రోజురోజుకి పెరిగిపోయేది..అవా బంగ్లాదేశ్ లో దొరకడం లేదు. ఫైనల్ గా ఒ నిర్ణయానికి వచ్చేశాడు..

భారత్ రావాలంటే… బంగ్లాదేశ్‌లో విమానం ఎక్కి ఇండియాకి రావాలి.. కానీ ఇందుకు వీసా ఇతరత్రా ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి. ఆ కుర్రాడు ఇదంతా వీలయ్యే పని కాదు అనుకున్నాడు. దానికి బదులు రహస్యంగా ఇండియాలోకి ప్రవేశించి చాక్లెట్స్ కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్ అని.. ఇమాన్ హొస్సేన్ (Eman Hossain)… రెండు దేశాల మధ్య ఉన్న షాల్దా నది (Shalda River) దగ్గరకు వచ్చాడు. ఆ నదే సరిహద్దు. ఆ నదిలో ఆ కుర్రాడు.. రెగ్యులర్‌గా ఈత కొడుతూ ఉంటాడు.

నదిలో దిగిన కుర్రాడు ఈదుకుంటూ… ఇండియాలోని త్రిపురలో ఉన్న సిపాహిజాలా జిల్లాకి చేరాడు. తీరా అక్కడికి వచ్చాక చూస్తే… ఇనుప కంచె ఉంది. దానికి ఓ చోట కన్నం పెట్టాడు. తద్వారా కంచె దాటి ఇండియాలోని కలంచౌరా గ్రామానికి వచ్చాడు. అక్కడ తనకు నచ్చే భారత డార్క్ చాక్లెట్లు కొనుక్కున్నాడు. తిరిగి ఆ నది దాటి బంగ్లాదేశ్ వెళ్లిపోయాడు. ఇలా ఈ పిల్లోడు ఒక్కసారి కాదు.. తరచూ చేస్తున్నాడు. ఏప్రిల్ 13న కూడా ఇలాగే చేస్తుండగా… BSF (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) జవాన్లు చూసేశారు… పట్టుకున్నారు. వదలేయమన్నాడు. చాక్లెట్ల కోసమే వచ్చానన్నాడు. కుదరదన్న జవాన్లు… స్థానిక పోలీసులకు అప్పగించారు. వాళ్లు కోర్టుకు తీసుకెళ్లారు.. కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ఆ కుర్రాడు… బంగ్లాదేశ్‌లోని కోమిల్లా జిల్లాకు చెందిన వాడని తెలిసింది. అతని దగ్గర కేవలం 100 బంగ్లాదేశీ టాకా (రూ.87) ఉన్నాయి. అతనిపై జాలి చూపిన అధికారులు ఎలాంటి తీవ్రమైన కేసులూ పెట్టలేదు. జస్ట్.. డాక్యుమెంట్స్ లేకుండా భారత్‌లో ప్రవేశించాడనే కేసు మాత్రమే పెట్టారు. ప్రస్తుతం ఆ కుర్రాడు జైల్లో ఉన్నాడు. దర్యాప్తు పూర్తయ్యాక బంగ్లాదేశ్‌కి అప్పగిస్తామంటున్నారు. అటువైపు నుంచి కుర్రాడి తల్లిదండ్రులు ఇంకా స్పందించలేదట.

ఇలా చాలా మంది బంగ్లాదేశీయులు తరచూ సరిహద్దు దాటి భారత్‌లోకి వస్తున్నారు. ఇండియాలోకి వచ్చి.. వంటింటి సామాన్లు కొనుక్కుంటున్నారు. భారత్‌లో జరిగే వేడుకల్లోనూ పాల్గొంటున్నారు. BSF జవాన్లు వారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. సైనికుల ఫోకస్ మొత్తం స్మగ్లర్లు, మనుషుల్ని ఎత్తుకుపోయే వారిపైనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news