Breaking : సీఎం కేసీఆర్‌ను కలిసి తన పెళ్లి రిసెప్షన్‌కు ఆహ్వానించిన శర్వానంద్‌

-

టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ జూన్ 3న రాత్రి 11 గంటలకు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌ వేదికగా రెండు రోజులపాటు గ్రాండ్‌‌గా జరిగింది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లి వేడుక అనంతరం జూన్ 9 న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు శర్వానంద్. ఈ మేరకు శర్వానంద్ స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఆహ్వానపత్రికను అందజేశారు. అనంతరం కాసేపు ముఖ్యమంత్రితో ముచ్చటించారు.

ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసిన హీరో శర్వానంద్

శర్వానంద్ రిసెప్షన్ కి అతిరథమహారధులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేసిన శర్వానంద్ 38 ఏళ్ల వయసులో ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. శర్వాని ఫాలో అవుతూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా వివాహానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు నటి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జూన్ 9నే జరగనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news