డిసెంబర్‌లోనే ఏపీలో ముందస్తు ఎన్నికలు : హీరో శివాజీ సంచలనం

-

టాలీవుడ్‌ హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని.. డిసెంబర్‌ లోపే ముందస్తు ఎన్నికలకు జగన్‌ వెళతారని హీరో శివాజీ ప్రకటన చేశారు. అధికార పార్టీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌ లో ఉన్నారని.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్‌ సినిమా పూర్తిగా క్లోజ్‌ అయిందని.. ఇక మూడు రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళతాడని పేర్కొన్నారు శివాజీ. అమరావతి రైతుల వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కట్టే పన్నును వాడికి వీడికి పంచే హక్కు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎక్కడ ఉందని నిలదీశారు.

రాబోయే ఎన్నికల్లో ముక్యమంత్రి తన స్థానాన్ని గెలుచుకోవడానికి గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బాబాయ్‌ వివేకా నంద రెడ్డి ఉంటే విజయం కాస్త సులవయ్యేదని.. పేర్కొన్నారు. ఓటు కు రూ.50 వేలు ఇచ్చినా.. ఈ సారి వైసీపీ గెలిచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు హీరో శివాజీ.

Read more RELATED
Recommended to you

Latest news