హైదరాబాద్ చేరుకున్న హోం మినిస్టర్ అమిత్ షా

-

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ నాయకత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రధాని మోడీ ఆదిలాబాద్, హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా హోం మినిస్టర్ అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు.ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన కేంద్రమంత్రి అమీషా కి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఇంపీరియల్ గార్డెన్స్కు ఆయన వెళ్లనున్నారు. సోషల్ మీడియా వారియర్స్తో సమావేశం తర్వాత పార్టీ నేతలతో భేటీ అయి రాబోయే లోక్సభ ఎన్నికలకు దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడి నుంచి ఎల్బీ స్టేడియంలో జరిగే విజయ సంకల్ప సమ్మేళనంలో పాలుపంచుకుంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

 

రాష్ట్రంలో 12 పార్లమెంట్ స్థానాలను గెలవాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version