తన సీటును తాను ప్రకటించుకోలేనివారు సీఎం ఎలా అవుతారు : అంబటి రాంబాబు

-

మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ సమీపిస్తుండడంతో వివిధ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ 7 జాబితాలను విడుదల చేయగా తాజాగా ప్రతిపక్ష టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను చేసింది. దీనిపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అవుతానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితమయ్యారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ‘లోకేశ్, బాబు సీట్లు ప్రకటించుకున్నారు. కానీ పవన్ తను పోటీ చేసే సీటును ప్రకటించుకోలేదు. 24 సీట్లతో సీఎం ఎలా అవుతావ్ అని ప్రశ్నించారు.పవన్కు ఓటమి భయం పట్టుకుంది అని అన్నారు. అందుకే పొత్తులతో ముందుకు వస్తున్నారు. జనసైనికుల ఆత్మగౌరవాన్ని పవన్ దెబ్బతీశారు’ అని ఆయన మండిపడ్డారు.

ఇవాళ తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను, జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.మొత్తం ఫస్ట్ లిస్ట్ లో మొత్తం118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version