జయహో బీసీ.. విజయవాడ సభకు వైసీపీ భారీ ఏర్పాట్లు…వంటకాలు ఇవే

-

జయహో బీసీ జెండాలు, హోల్డింగ్లతో విజయవాడ కలకలలాడుతోంది. ఇవాళ వైసిపి పార్టీ ఆధ్వర్యంలో బిసి మహాసభ జరగనుంది. ఈ సభ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లో జరగనుంది. అయితే విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో ఇవాళ జరిగే జయహో బీసీ సభకు వచ్చే వారి కోసం పసందైన వంటకాలను సిద్ధం చేశారు.

టిఫిన్ లో ఇడ్లీ, గారె, మసాలా ఉప్మా, పొంగలి ఉన్నాయి. భోజనానికి మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొయ్యల కర్రీ, చేపల పులుసు, కట్ట, అన్నం, పెరుగు, చక్కెర పొంగలి, వెజ్ బిర్యానీ, పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ, బీన్స్ జీడిపప్పు కర్రీ, గోంగూర పచ్చడి, టమాటా పప్పు, సాంబారు, పెరుగు వడ్డిస్తారు

Read more RELATED
Recommended to you

Latest news