OTTలో కమల్ హాసన్ ‘విక్రమ్’..భారీ ధరకు డీల్?

-

లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సినిమాలో కమల్ హాసన్ మరోసారి తన నట విశ్వరూపం చూపించారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య ఈ ఫిల్మ్ లో నటించారు.

 

లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చారు. కాగా, అప్పుడే ఈ చిత్ర OTT స్ట్రీమింగ్ గురించి చర్చలు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఓటీటీతో పాటు శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయని కోలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

కోలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. ఈ సినిమా బడ్జెట్ రూ.110 కోట్లు కాగా, ఈ సినిమా ఓటీటీ ప్లస్ శాటిలైట్ రైట్స్ కొనుగోలు ద్వారా రూ.90 కోట్లు అదనంగా లాభం వచ్చినట్లు సమాచారం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ఈ చిత్ర స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసినట్లు వినికిడి.

Read more RELATED
Recommended to you

Latest news