జగన్ ముందు మోకాళ్ళపై కూర్చున్న ఐఏఎస్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన 73 వ గణతంత్ర వేడుకల్లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 73 వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో జెండా ఎగురవేసి.. ప్రజలతో ముచ్చటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

అయితే ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలవగానే వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మోకాళ్లపై కూర్చుని ఆయనతో మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ సంఘటన పై భిన్న రకాల స్పందన వస్తుంది. విప పక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ కాళ్లపై మాజీ కలెక్టర్ వెంకట రామయ్య పడ్డారు. అప్పుడు ఆ ఘటన సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news