ఇండియా కరోనా అప్డేట్‌..కొత్తగా 37,875 కేసులు

-

మన దేశాన్ని కరోనా మహమ్మారి వదిలేలా లేదు. ఇవాళ మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్నటి రోజున తగ్గిన కరోనా కేసులు…ఇవాళ మాత్రం భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 37,875 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,96,718 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,91,256 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.51 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 369 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,41,411 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 39,114 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,22,64,051 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 70,75,43,018 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో మాత్రం 78,47,625 మందికి వ్యాక్సిన్‌ వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news