ఇండియాలో భారీగా తగ్గిన కరోనా .. కొత్తగా 18,795 కేసులు

-

ఇండియాను కరోనా మహమ్మారి వదిలేలా లేదు. అయితే…. ఇవాళ మాత్రం కరోనా కేసులు భారీగా తగ్గి పోయాయి. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ మాత్రం కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,795 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,36,97,581 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,92,206 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.19 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 179 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,47,373 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26,030 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 87,07,08,636 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో మాత్రం 1,02,22,525 మందికి వ్యాక్సిన్‌ వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 32,9,58,002 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news