ఇండియాలో కొత్తగా 10,488 కరోనా కేసులు..532 రోజుల తర్వాత ఇదే మొదటిసారి

-

ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం…. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,488 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,10,413 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,22,714 కు చేరింది.

యాక్టివ్‌ కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదు కావడం 532 రోజుల అనంతరం ఇదే మొదటి సారి. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.26 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 313 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,65,662 కి చేరింది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,39,22,037 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,16,50,55,210 మంది కి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 63,16,49,378 కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news