అందరూ 3 పెళ్ళిళ్ళు చేసుకోమంటే ఏపీ మహిళలు ఏమైపోతారు – జగన్‌

-

అందరూ 3 పెళ్ళిళ్ళు చేసుకోమంటే ఏపీ ఏమైపోతుందని.. ఏపీలో మహిళల పరిస్థితి ఏమైపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇవాళ కృష్ణా జిల్లా, అవనిగడ్డలో ఇవాళ సీఎం జగన్‌ పర్యటించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. మూడు రాజధానులు కాదు.. మూడు పెళ్ళిళ్ళు చేసుకోమంటే వ్యవస్థ ఏమైపోతుందని నిలదీశారు. ఒక్క జగన్ ని కొట్టడానికి ఇంత మంది ఏకమవుతున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుందని ఆగ్రహించారు సీఎం జగన్. దత్తతండ్రి, దత్త పుత్రుడు ఇద్దరూ కలిసి.. తనపై దాడి చేశారని ఏమోషనల్‌ అయ్యారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news