చంద్రబాబు పేరు చెబితేనే జగన్ బయపడుతున్నారు: అయ్యన్న పాత్రుడు

-

చోడవరంలో నిర్వహించిన టిడిపి మినీ మహానాడులో జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. చంద్రబాబు పేరు చెబితేనే జగన్ బయపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. దొంగోడికి పోలీసులు కాపలా కాస్తున్నారు అని మండిపడ్డారు. కలెక్టర్లు, ఎస్పీలు ప్రభుత్వానికి తమ వంతు సాయం చేస్తున్నారని చెప్పారు. తమ కార్యక్రమాలకు గ్రామాల నుంచి వచ్చే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ ఓ శాడిస్ట్ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇదిలా ఉంటే చోడవరం నుంచి జగన్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మహిళల పాత్ర కీలకమన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు అని తెలిపారు. మహానాడును అడ్డుకునే ప్రయత్నం చేశారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని దుయ్యబట్టారు. టిడిపి కార్యకర్తలను, నేతలను వేధిస్తే మీ గుండెల్లో నిద్రపోతా అని చంద్రబాబు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news