హత్యా రాజకీయాలకు జగన్ వారసుడు : నారా లోకేష్

-

హత్యా రాజకీయాలకు సీఎం జగన్‌ వారుసుడని నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ”హత్యా రాజకీయాలకు జగన్‌వారసుడు సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయింది. ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారింది. పాలనతో ప్రజల్ని మెప్పించలేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిని చంపి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు.” అంటూ ఫైర్‌ అయ్యారు.

గుంటూరు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, గుండ్లపాడు గ్రామంలో వైసిపి ఫ్యాక్షన్ మూకలు టిడిపి గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యని దారుణంగా హత్య చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి… అరాచకం రాజ్యమేలుతున్న మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత కోసం అందరూ ఒక్కటై పోరాడాలని కోరారు. చంద్రయ్య కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందన్నారు.

కాగా… గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ కీలక నేత దారుణ హత్యకు గురయ్యాడు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపేశారు. చంద్రయ్య గ్రామ సెంటర్‌ లో కూర్చుని ఉన్న సమయంలో.. ఈ ఘటన చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version