ఉండవల్లి..సీఎం కేసీఆర్‌ కు ఆస్థాన కవి – జగ్గారెడ్డి

-

ఉండవల్లి..సీఎం కేసీఆర్‌ కు ఆస్థాన కవి అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు చేశారు. ఆ స్థాన కవులు అంతకు మించి ఏం చెప్తారని.. రాజు మెప్పు కోరే మాటలు చెప్పడమే ఆస్థాన కవి పని అంటూ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కు కౌంటర్‌ ఇచ్చారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సీఎం కెసిఆర్ వెంట ఇప్పుడు అంతా సమైక్య వాదులే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కెసిఆర్… brs పార్టీ కాకుంటే ప్రపంచ పార్టీ పెట్టుకుంటే బెటర్ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం.. మిషన్ భగీరథ డబ్బులతో ఏదైనా పెట్టొచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయం అసాధ్యమని.. కాంగ్రెస్ లేకుండా స్టాలిన్ వస్తారా..? అని నిలదీశారు. రాహుల్ గాంధీ నీ ed ఎన్ని రోజులు పిలిస్తే అన్ని రోజులు ఆందోళనలు ఉంటాయని పేర్కొన్నారు. గాంధీ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news