అధికారంతో సంబంధం లేదు…మాకు ప్రజలే ముఖ్యం – పవన్‌ కళ్యాణ్‌

-

అధికారంతో సంబంధం లేదు…మాకు ప్రజలే ముఖ్యమన్నారు పవన్‌ కళ్యాణ్‌. జనసేన జనవాణి పార్టీ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ… ప్రజలు తమ సమస్యలపై అర్జీలను జనవాణి కార్యక్రమంలో తీసుకుంటామని చెప్పారు. అర్జీలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషిచేస్తామని.. ఉత్తర్వులు ఉన్నా ప్రజల సమస్యలు కావడం లేదని వెల్లడించారు.

ప్రజల మధ్యకు వెళ్లి సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని.. అధికారంతో మాకు సంబంధం లేదన్నారు పవన్‌. అధికారం ఉన్నా లేకున్నా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని… సీఎం ఇంటి వద్ద పేదల ఇళ్ల కూల్చివేతపై ఒకరు గతంలో నాకు ఫిర్యాదు చేశారని చెప్పారు.

కారణం తెలియదు కానీ నాకు ఫిర్యాదు చేశాక వారి సోదరుడు ప్రాణాలు కోల్పోయారని.. కుటుంబానికి న్యాయం జరగలేదని, ధృవపత్రాలు ఇవ్వడం లేదని బాధితుల ఆవేదన నన్ను కదిలించిందని పేర్కొన్నారు. నాదెండ్ల మనోహర్ సభాపతిగా ఉన్నప్పుడు గతంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించారని.. నాదెండ్ల మనోహర్ సూచన సలహాలతో జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజల కష్టాలను తీర్చాలనే సంకల్పంతోనే జనవాణి కార్యక్రమం ప్రారంభించామని… ప్రజలు మా వద్దకు రాలేకపోతే మేమే ప్రజల వద్దకు వెళతామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version