పవన్ కళ్యాణ్ కు షాక్..సీఎం కేసీఆర్ తో జనసేన సలహాదారు సమావేశం

-

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. బిఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో విస్తరించేందుకు గులాబీ దళం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న వేల కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ సలహాదారు, తమిళనాడు మాజీ సిఎస్ రామ్మోహన్ రావు, బిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావును కలిశారు.

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితర నేతలతో కలిసి బుధవారం ప్రగతి భవన్ కు వచ్చిన రామ్మోహన్ రావు, కేసీఆర్ తో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ను రామ్మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారని ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news