జగన్‌ కు జనసేన మరో షాక్‌.. #GoodMorningCMSir మరో నిరసన కార్యక్రమం

-

జగన్‌ కు జనసేన మరో షాక్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రహదారుల దుస్థితిని తెలియచేసేందుకు జనసేన పార్టీ మరో కార్యక్రమం చేపట్టనుంది. #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ చేయనుంది. జులై 15, 16, 17 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించనుంది. రాష్ట్రంలో రహదారులు కనీస మరమ్మతులు కూడా కాలేదు.. గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి గారిని నిద్ర లేపేందుకే #GoodMorningCMSir కార్యక్రమం చేపట్టనుంది.

డిజిటల్ క్యాంపెయిన్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాల్గొంటారు. ఫోటోలు, వీడియోలు స్వయంగా డిజిటల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో రహదారుల దుస్థితిపై జనసేన వీర మహిళలు నాయకులు, జన సైనికులు ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసే కార్యక్రమం నిర్వమించానున్నారు.

గ్రామాలు, మండలాల్లో రహదారుల దుస్థితిని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని..రోడ్డు మరమ్మత్తుల కోసం అని చెప్పి ఎక్కువ వడ్డీలకు నిధులు తెచ్చి ఆ సొమ్ములు మళ్లించేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం మభ్యపెడుతోందని జనసేన వెల్లడించింది. పెట్రోల్ మీద ఏటా సామాన్యుడి నుంచి రూ. 750 కోట్లు రోడ్ సెస్ వసూలు చేస్తున్నారు.. ఆ సెస్ చూపి రూ. 6 వేల కోట్లు అప్పులు తెచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి జవాబుదారీతనం ఉంటే ఆ నిధులు ఎందుకు ఖర్చు చేశారో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని..డిమాండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news