ఓరి నాయనో ఇదేం పిచ్చి రా బాబు..అక్కడ కూడా వదలరా..

-

సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అంతరిక్షంలోకి కూడా వెళ్ళి వస్తున్నారు. సైన్స్ తో పాటు టెక్నాలజీ వాడకం కూడా రోజు రోజుకు విపరీతంగా పెరిగి పోతుంది.. ప్రాణాలను హరించి వేస్తున్న కరోనా మహమ్మారికి కూడా మందును కనిపెట్టారు. ఇంతగా సైన్స్ దూసుకు పోతున్నా కూడా మూఢనమ్మకాలు కూడా అంతకు మించి పెరిగి పోతున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

భూతవైద్యాన్ని నమ్మేవారు మారుమూల పల్లెలతో పాటు సిటీలోనూ కొందరు ఉన్నారు. చదువుకున్న వాళ్లలోనూ ఈ మూఢనమ్మకాలు ఉన్నాయి. అందుకు మదనపల్లిలో కుమార్తెలను చంపుకున్న తల్లీదండ్రుల పిచ్చితనమే ఉదాహారణ. తాజాగా ఝార్ఖండ్​లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ఓ మహిళను పాము కాటేసింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో.. ఐసీయూ లో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆమె చికిత్స పొందుతున్న గదికి భూతవైద్యుడిని తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతున్న మహిళ కోలుకోవాలని అతడితో మాంత్రిక.. తాంత్రిక పూజలు చేయించారు.

అయితే ఆసుపత్రి యాజమాన్యం కూడా ఈ విషయం పై నోరు మెదపలేదు.. దాంతో ఈ యవ్వారం మొత్తం 3 గంటల పాటు జరిగింది. బాధితురాలి వీపుపై పళ్లెం పెట్టి.. ఏవో పూజలు చేశాడు ఆ మాంత్రికుడు. ఆమె బాడీ నుంచి పాయిజన్ తీసినట్లు కాసేపు కలరింగ్ ఇచ్చాడు. ఈ తంతును ఆస్పత్రి స్టాఫ్ తో పాటు కొందరు డాక్టర్లు సైతం తిలకించారు. బాధితురాలు ఆంబువా ఏరియాకు చెందిన శక్తి నాయక్​ భార్య 25 ఏళ్ల అర్చనా దేవిగా తెలుస్తోంది.. గుమ్లా సదర్ ఆస్పత్రిలో ఈ భూతవైద్యం జరిగింది. గతంలో అక్కడ ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నట్లు కొందరు చెబుతున్నారు.మొత్తానికి ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news