Jubilee Hills Rape Case: కస్టడీలో కొట్టుకున్న నిందితులు

-

రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక రేప్ కేసు అంశం సంచలనం రేపింది. ఈ కేసులో నెమ్మనెమ్మదిగా నిజాలు బయటపడుతున్నాయి. అసలు నిందితుడు శాస్త్రీపురం కార్పొరేటర్ కుమారుడనే అని సాదుద్దీన్ మాలిక్ కస్టడీ రిపోర్ట్ లో తెలిపినట్లు సమాచారం. పబ్ లోకి ఎంటర్ అయిన వెంటనే కార్పొరేటన్ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు అమ్మాయి కోసం వెతికారని.. ఇద్దరు కలిసి పబ్లో అమ్మాయిని వేధించారని విచారణలో తెలిపాడని తెలుస్తోంది. పబ్ బయటకు వచ్చిన కార్పొరేటర్ కుమారుడు బాలిక వెంట పడ్డాడని.. నేను వద్దని వారించాని, తనను బెంజ్ కార్లో ఎక్కవద్దని ఎమ్మెల్యే కుమారుడు ఆదేశించాడని సాదుద్దీన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. బెంజ్ కార్లో ఎక్కిన తర్వాత అమ్మాయిపై లైంగిక దాడి చేశారని విచారణలో వెల్లడించాడు. 

ఇదిలా ఉంటే మైనర్ బాలిక అత్యాచారం విషయంలో నిందితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని.. ఒకరిని ఒకరు కొట్టుకున్నట్లు తెలుస్తోంది. మైనర్ పై అత్యాచారాని నువ్వే కారణం అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఈ పరిస్థితికి కార్పొరేటర్ కుమారుడే కారణం అంటూ మిగతా మైనర్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. నా వల్లే ఇదంతా జరిగిందని ప్లేట్లతో దాడి చేసుకున్నట్లు సమాచారం. జువైనల్ హోమ్ లో రాత్రి వాగ్వివాదం చోటు చేసుకోవడంతో సర్ది చెప్పిన నిర్వాహకులు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news