ఒకసారి పెట్టుబడి పెడితే చాలు..నెలకు రూ.12 వేలు పెన్షన్..!!

-

ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందించడంతో పాటు ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఫథకాలను అందిస్తూ వస్తుంది.సురక్షితమైన పెట్టుబడి, మంచి రాబడి కోసం ఎల్‌ఐసీకి మించినది మరొకటి లేదు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇందులో గొప్ప స్కీంలు ఉన్నాయి. అందులో ఒకటి సరళ పెన్షన్ ప్లాన్. ఇది వృద్ధులకు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇందులో పెట్టుబడి పెట్టిన తర్వాత నెలా నెలా పెన్షన్ ను పొందవచ్చు..

ఎల్‌ఐసీ సరళా పెన్షన్ ప్లాన్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీరు జీవితాంతం పెన్షన్ పొందుతూనే ఉంటారు. పాలసీదారు మరణించిన తర్వాత పెట్టుబడి మొత్తం తిరిగి నామినీకి ఇస్తారు. ఈ పథకాన్ని 40 ఏళ్ల వయస్సు నుంచి 80 ఏళ్ల వయస్సు వరకు కొనుగోలు చేయవచ్చు. మీరు ఒంటరిగా లేదా భార్యాభర్తలతో కలిసి ఈ పథకాన్ని తీసుకోవచ్చు. పాలసీదారు ఈ పాలసీని ప్రారంభించిన తేదీ నుంచి అవసరమైతే 6 నెలల తర్వాత సరెండర్ చేసే అవకాశం ఉంటుంది.

దీంతో ఈ మధ్య రిటైర్మెంట్‌ తీసుకున్న వ్యక్తులు నెలకు 12,000 పెన్షన్ పొందవచ్చు. ఎలాగంటే రిటైర్మెంట్‌ తర్వా త పీఎఫ్‌ ఫండ్ నుంచి వచ్చిన డబ్బు ఇందులో పెట్టుబడి పెడితే సులువుగా పెన్షన్ పొందుతారు. ఎల్‌ఐసీ కాలిక్యులేటర్ ప్రకారం ఎవరైనా 42 ఏళ్ల వ్యక్తి రూ. 30 లక్షల ప్లాన్‌ కొనుగోలు చేస్తే అతను ప్రతి నెలా రూ.12,388 పెన్షన్‌గా పొందుతాడు. ఈ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. ఈ ప్లాన్‌లో ఒకసారి ప్రీమియం చెల్లించిన తర్వాత ఎవరైనా వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన పెన్షన్ తీసుకోవచ్చు..ఇకపోతే ఈ పాలసీని తీసుకోవడం వల్ల లోన్ పొందే సౌకర‍్యం కూడా ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news