నాకు అవకాశం ఇవ్వండి…చైనా, అమెరికా కంటే అభివృద్ధి చేస్తా – కేఏ పాల్

-

లక్షల మంది కడుపుల మీద కొట్టారని సోనియాగాంధీపై కేఏ పాల్ ఫైర్‌ అయ్యారు. మోడీ, సోనియా, కెసిఆర్, చంద్రబాబు , జగన్ వీరిని నమ్మొద్దు… వీరంతా మోసగాళ్ళు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకొక అవకాశం ఇవ్వండి… నేను చైనా, అమెరికా కంటే అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. వరంగల్ సభ కోసం కాంగ్రెస్ పార్టీ 87కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టారని… ఎప్పుడైనా 70సంవత్సారలలో రైతులకు గిట్టబాటు ధర ఇచ్చారా? అని నిలదీశారు.

దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని.. రాహుల్ గాంధీ వాగ్ధానాలు అన్ని వింటే నవ్విస్తుందని ఎద్దేవా చేశారు. ఇది కేవలం తెలంగాణ ప్రజల ని మోసం చేయడం కోసమేనని.. ఎందుకు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ మాయ మాటలు విని ప్రజలు మోసపోఎందుకు సిద్దంగా లేరని… మీకు దేశంలో ఎక్కడ డిపాజిట్ లు రాలేదని పేర్కొన్నారు.

మీరు దేశాన్ని, ప్రజలను మోసం చేశారు… అందుకే మీకు ఈ శిక్ష అని.. కాంగ్రెస్ నాయకులు అంత ఈ కుటుంబ పాలన వద్దు అని అంటున్నారని చురకలు అంటించారు. తెరాస పాలన లో నడి రోడ్డు పై ఓ వ్యక్తి ని చంపేస్తే అడిగే నాథుడే లేడని.. ఓ లాయర్ నడి రోడ్డు పై చంపేశారు… దానిపై ఇంత వరకు చర్యలు లేవని ఫైర్‌ అయ్యారు. గాంధీ ఫ్యామిలీ ని నమ్మొద్దన్నారు కెఏ పాల్.

Read more RELATED
Recommended to you

Latest news