రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్న హీరో కమల్ హాసన్

-

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈరోజు ఉదయం ఢిల్లీలో ప్రవేశించింది. ఢిల్లీలో 28 3 కిలోమీటర్ల మేరా ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు NHPC మెట్రో స్టేషన్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, హీరో కమల్ హాసన్ రాహుల్ గాంధీ తో పాటు కలిసి నడిచారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత్ జోడోయాత్రలో పాల్గొనవద్దని.. ఒకవేళ పాల్గొంటే రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని తనకు చాలామంది చెప్పారని వెల్లడించారు. కానీ తనకు రాజకీయాల కంటే దేశాన్ని సమైక్యంగా ఉంచడమే ముఖ్యమని స్పష్టం చేశారు కమల్ హాసన్. యాత్రలో పాల్గొనాలని రాహుల్ గాంధీ తనను వ్యక్తిగతంగా ఆహ్వానించారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news