జైలుకు వెళ్లాడానికైనా నేను సిద్దమే – కల్వకుంట్ల కవిత

-

జైలుకు వెళ్లాడానికైనా నేను సిద్దమేనని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.  లిక్కర్ స్కాం లో నిన్న కవిత పేరును ఈడీ అధికారులు చేర్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్వయంగా కల్వకుంట్ల కవిత స్పందించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా తొమ్మిది ప్రభుత్వాలను పడగొట్టిందని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చే ముందు ఈడి దాడులు చాలా కామన్ అని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి.. అందుకే మోడీ కంటే ముందు ఈడి వచ్చింది. అందుకే తనపై కూడా కుట్రలు చేస్తున్నారని బిజెపి పై నిప్పులు జరిగారు. నా మీద మంత్రులు ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టింది బిజెపి… ఇది రాజకీయ ఎత్తుగడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు పెట్టుకోండి… విచారణ చేసుకోండి… మమ్మల్ని జైల్లో వేసుకోండి… దేనికి కూడా తాము భయపడబోము అని కవిత స్పష్టం చేశారు. ఈడీ కేసులకు అస్సలు తాము బెదరబోమని చెప్పారు కవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version