KCR : విజయకాంత్‌ మరణం పట్ల కేసీఆర్‌ సంతాపం

-

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడిగా కళారంగానికి, రాజకీయ వేత్తగా నటుడు విజయ్ కాంత్ చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. విజయకాంత్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని కెసిఆర్ తెలిపారు.

నటుడు విజయ్ కాంత్ శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్‌ హాస్పిటల్ లో చేరారు. పరీక్షల్లో ఆయనకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్‌ మరణించారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి వెల్లడి చేశారు. గత సంవత్సరం నుంచి 71 ఏండ్ల విజయకాంత్‌ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల నవంబర్ 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో చెన్నైలోని మియోట్‌ హాస్పిటల్ లో చేరి డిసెంబర్ 11 న ఇంటికి వెళ్లారు. అయితే అప్పుడే ఆయన మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ వదంతులను విజయ్ కాంత్ భార్య ప్రేమలత కొట్టిపారేశారు. అయితే 2 వారాలు గడువకముందే ఆయన కొవిడ్‌ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో గురువారం ఉదయం మరణించారు. తమిళ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన విజయకాంత్‌.. ఆ తర్వాత రాజకీయాల్లో సైతం అడుగుపెట్టి 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version