BREAKING : దసరా రోజునే జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన..

-

BREAKING : దసరా రోజునే జాతీయ పార్టీపై తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ నెల 5 న కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని.. ఆ కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీకి అక్టోబర్ 6 న ప్రతినిధుల బృందం వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది.

మహారాష్ట్ర నుంచి కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనకు ప్లాన్ వేస్తున్నారు సీఎం కేసీఆర్‌. కొత్త పార్టీ ఏర్పాటులో ఇబ్బందులు సృష్టిస్తే న్యాయ పోరాటంకు కూడా రెడీ అంటున్నాయి టిఆర్ఎస్ వర్గాలు. ఇక ఇందులో భాగంగానే ఇవాళ సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహిస్తున్నారట. ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్.. జరుగనుంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు, 33 జిల్లాల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. ఈ కీలక సమావేశంలో.. జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్‌ చర్చలు జరిపే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news