తెలంగాణా మంత్రుల వాహనాలపై గెరిల్లా దాడులు చేయండి: ఐపిఎస్ అధికారి సంచలనం

-

వరంగల్ గిరిజన నేతలు, రాష్ట్ర కేబినెట్ మంత్రులపై నోరు పారేసుకున్నారు కేరళ ఐపిఎస్ అధికారి లక్ష్మణ్. ఐజీ కేడర్ లో ఉండి మావోయిస్టుల తరహా గెరిల్లా దాడులు చేయాలన్న లక్ష్మణ్… మంత్రుల వాహనాలు ధ్వంసం చేయాలని… రాష్ట్రంలో అలజడులు రేపి హక్కులు సాధించాలని సూచించారు. సెమినార్ లు, మీటింగ్ ల ద్వారా ఒరిగేవి ఏమీ లేదని పేర్కొన్నారు. గిరిజన మంత్రి, ఎంపీని దారుణంగా మాట్లాడారు ఆయన.

సోషల్ మీడియాలో ఐపీఎస్ అధికారి బూతు పురాణం వైరల్ గా మారింది. వరంగల్ జిల్లా మంత్రులు ఎంపీ మాజీ ఎంపీ సహా గిరిజన నేతల పై నోరు పారేసుకోవడం గమనార్హం. గిరిజన హక్కుల సాధనకు సహకరించాలని గిరిజన రిజర్వేషన్ సాధన సమితి నాయకుడు బానోత్ విజయ్ కోరారు. బానోతు విజయ్ ని ఎన్కౌంటర్ చేస్తానంటూ లక్ష్మణ్ బెదిరించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version