అసెంబ్లీలో అరుదైన సన్నివేశం..ఈటలను కలిసిన కేటీఆర్…!

-

నిన్న తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే..ఈ సమావేశాల నేపథ్యంలో… ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సరిగ్గా సంవత్సరం కిందట మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌.. నిన్న ప్రతి పక్ష ఎమ్మెల్యగా సభలో అడుగు పెట్టారు. సభలో ఆయన అందరినీ ఆకర్షించేలా అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే.. ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.

ఈటల రాజేందర్‌ ను పలకరించేందుకు మంత్రి కేటీఆర్‌ కలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అన్నా బాగున్నారా అంటూ అప్యాయంగా పలకరించారు మంత్రి కేటీఆర్‌. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కు శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్‌ రావు, రాజాసింగ్‌ను కూడా మంత్రి కేటీఆర్‌ పలకరించారు. అయితే.. ఈటల రాజేందర్‌ వద్దకే మంత్రి కేటీఆర్‌ వెళ్లడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. కాగా.. నిన్న సభ ప్రారంభం అయ్యాక.. ఈటల, రఘునందన్, రాజాసింగ్‌ లను సస్పెండ్‌ చేశారు అసెంబ్లీ స్పీకర్‌ పోచారం.

Read more RELATED
Recommended to you

Latest news