ప్రధాని మోడీ పై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్

-

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  ప్రధాని మోడీ పై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. పెట్రో ధరల పెంపు విషయం లో యూపీఏ ప్రభుత్వం ను మోడీ ప్రశ్నించిన ట్వీట్స్ తో పీఎం మోడిని ప్రశ్నించాడు మంత్రి కేటీఆర్..

“గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ, మిషన్ భగీరథ పథకానికి భారత ప్రభుత్వ సహకారం ఎంత ఉందో దయచేసి తెలంగాణ ప్రజలతో పంచుకోండి..మిషన్ భగీరథ స్కీమ్ కు మీ ప్రభుత్వం సున్నా సహకారం అందించడం ప్రధానమంత్రి స్థాయికి తగినది కాదు” అంటూ మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ అని బిజేపి వాళ్లు మొదటి నుండి చెపుతూనే ఉన్నారు మనకే అర్దం కావడం లేదని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలు డబుల్ చేయడం, కార్పొరేట్ సంస్థల సపదన డబుల్ చేయడం, నిత్యవసర వస్తువుల ధరలు డబుల్ చేయడం, గ్యాస్ ధరలు డబుల్ చేయడమేనా డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యం అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news