ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు : నందమూరి ఫ్యామిలీ పై లక్ష్మీపార్వతి సెటైర్ !

-

అసెంబ్లీ ఘటనపై… వైసిపి నేత లక్ష్మీపార్వతి స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి. చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకొని పెద్ద సీన్ క్రియేట్ చేశారని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్లాంటి కుటుంబంలో పుట్టి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారని నందమూరి ఫ్యామిలీ పై సెటైర్లు పిలిచారు లక్ష్మీపార్వతి.

మీరు అంగీకరించిన లేకుండా నేను ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా అంటూ స్పష్టం చేశారు. మీ నాన్న కు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని… ఏరోజైనా మీ నాన్న బాధ మీరు విన్నారా అంటూ చురకలంటించారు. తండ్రి సుఖాన్ని కూడా మీరు అర్థం చేసుకోకుండా చంద్రబాబు చేశాడు అని మండిపడ్డారు.

సానుభూతి కోసం మీ చెల్లెల్ని బజార్న పెట్టాడని… చంద్రబాబుకు చనిపోయేవరకు పది కావాలన్నారు. చంద్రబాబు నాయుడు యధావిధిగా కుటుంబానికి అబద్ధం చెప్పాడని.. ఎన్టీఆర్ ను మోసం చేసినట్లే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ ని కూడా మోసం చేస్తున్నాడని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లో ఏమి జరగకున్నా… మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ఎపిసోడ్ లోని భువనేశ్వరి, పురందేశ్వరి అలాగే బాలకృష్ణ మనసు చంద్రబాబు మార్చాడని గుర్తుచేశారు లక్ష్మీపార్వతి.

Read more RELATED
Recommended to you

Latest news