రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు – మంత్రి తలసాని

-

నల్లగొండ జిల్లా మునుగోడు (మం)కిష్టాపురం గ్రామంలో గొర్రెలకు, పశువులకు, వ్యాక్సినేషన్ ను ప్రారంభించి, అనంతరం పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, పాల్గొన్న MP బడుగుల లింగయ్య యాదవ్. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మునుగోడుకు ఏం చేశారో కేంద్ర హోమ్ శాఖమంత్రి మునుగోడు సభలో ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు.

కొందరు మూర్ఖులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారని.. కానీ జరుగుతున్న అభివృద్ధికి ప్రజలే సాక్ష్యం అన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం అని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, ఎవరూ రాజీనామా చేస్తే జరగడం లేదు.. కేవలం ముఖ్యమంత్రి ముందుచూపు వలె సాధ్యమవుతుంది అన్నారు. మునుగోడు కు వస్తున్న కొందరు నేతలు ఆవాక్కులు, చవాక్కులు మాట్లాడుతున్నారని.. వారికి మునుగోడు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news