నేడు ప్రభాస్ చేతుల మీదుగా లైగర్ ట్రైలర్ రిలీజ్

-

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.

అయితే ఈ లైగర్ సినిమా ట్రైలర్ ఇవాళ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేసింది చిత్ర బృందం.

కాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కానున్న నేపథ్యంలో.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హడావిడి చేస్తూ ఉన్నారు. అంతేకాదు హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో విజయ్ దేవరకొండకు భారీ కటౌట్ ఏర్పాటు చేశారు ఆయన ఫ్యాన్స్. ఏకంగా 75 ఫీట్ల కటౌట్ ను ఆయన ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. కాగా.. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version