తమకు ఓటేయ‌క‌పోతే వేటు వేయ‌డం వైసీపీ న‌యా ఫ్యాక్ష‌న్ డెమోక్ర‌సీ – నారా లోకేష్

-

తమకు ఓటేయ‌క‌పోతే వేటు వేయ‌డం వైసీపీ న‌యా ఫ్యాక్ష‌న్ డెమోక్ర‌సీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థుల ఏక‌గ్రీవానికి ఒప్పుకోక‌ుంటే చేసిన అరాచకం చూశామన్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ దాడులు, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్‌లు, హ‌త్య‌లు చేయ‌డం చూశామని ఆగ్రహించారు.

ఎన్నిక‌లై చాలా రోజులైనా టీడీపీకి ఓట్లేశార‌ని, మ‌ద్ద‌తు ప‌లికార‌నే క‌క్ష‌తో ఇప్ప‌టికీ వైసీపీ నేత‌లు నానా ఇబ్బందుల‌కి గురిచేస్తూనే వున్నారన్నారు. ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి మండ‌లం గానుగ పెంటలో మేకల కాపరి మ‌ర్రి శ్రీను ఇంటిని వైసీపీ నేతలు కబ్జా చేశారని నిప్పులు చెరిగారు. స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి ఓటేసి త‌న ఓట‌మి కార‌ణం అయ్యాడ‌నే క‌క్ష‌తో మర్రి శ్రీను ఇంటినే క‌బ్జా చేశారని విమర్శలు చేశారు. అధికారం అండ‌తో ఏకంగా ఇల్లు ఆక్ర‌మించేయ‌డంతో ఆ కుటుంబం రోడ్డున ప‌డింది… ఇంకెన్నాళ్లు మీ అరాచ‌కాలు జగన్ రెడ్డి గారూ! అని ప్రశ్నించారు. ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌క‌ముందే ఇటువంటి క‌బ్జాలు, అరాచ‌కాలు మానండని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news