ఏపీని బీహార్ కంటే దారుణంగా మార్చారు..అనంత బాబు డ్రైవర్‌ మృతిపై లోకేష్‌ ఫైర్‌

-

ఏపీని బీహార్ కంటే దారుణంగా మార్చారని వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్‌ మృతిపై నారా లోకేష్‌ ఫైర్‌ అయ్యారు. ఏపీని బీహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా మార్చేసింది వైసిపి మాఫియా అని… వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారని నిప్పులు చెరిగారు.

ys jagan on nara lokesh

తన వద్ద డ్రైవరుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంని అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ అనంత బాబు తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా అతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులకు హత్యలు, అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా ?అని నిలదీశారు. సుబ్రహ్మణ్యంని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. హత్యపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని.. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకుని కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news