సీఎం జగన్ పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. పిశాచి అంటూ !

-

సీఎం జగన్ పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ర‌క్త పిశాచుల గురించి విన్నాం. తొలిసారిగా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రూపంలో ధ‌న‌పిశాచిని చూస్తున్నాం. నిరుపేద‌లు, కూలీలు రోజంతా రెక్క‌లు ముక్క‌లు చేసుకుని సంపాదించిన డ‌బ్బునీ మ‌ద్యం పేరుతో లాగేస్తున్నారన్నారు. బాప‌ట్ల‌ జిల్లా రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో మీరు త‌యారుచేసి మీరే అమ్ముతోన్న విష‌మ‌ద్యం తాగి ముగ్గురు బ‌ల‌య్యారు. మరి కొంత మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంతా ఇసుకపల్లి ప్రభుత్వ మద్యం షాపులోనే మద్యాన్ని కొన్నారని ఫైర్ అయ్యారు లోకేష్.

విష‌మ‌ద్యంతో ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తూ కోట్లు లెక్క పెట్టుకుంటున్న సీఎం గారూ మీ జే బ్రాండ్ విష‌మ‌ద్యంతో ఇంకెంద‌రిని బ‌లి తీసుకుంటారు? ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల్లో జే బ్రాండ్లు అమ్మ‌కం నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర‌ వ్యాప్తంగా అన్నివైన్‌షాపుల నుంచీ శాంపిళ్ల‌ని సేక‌రించి ల్యాబుల్లో ప‌రీక్షించాలి. జే బ్రాండ్స్ తాగి చ‌నిపోయిన ఒక్కొక్క‌రి కుటుంబానికి 50 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్ర‌జారోగ్యాన్ని హ‌రిస్తూ, ప్ర‌మాద‌క‌ర మ‌ద్యంతో ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తూ వేల‌కోట్లు వెనకేసుకుంటున్న మ‌ద్యం మాఫియాపై కేంద్రం సీబీఐతో ద‌ర్యాప్తు చేయించాలన్నారు లోకేష్.

 

Read more RELATED
Recommended to you

Latest news