సీఎం జగన్ పై లోకేశ్ విమర్శనాస్త్రాలు

-

చిత్తూరు టీడీపీ కార్యాలయం వద్ద లోకేశ్ బహిరంగ సభ నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే…. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ అసలు పేరు జగన్ మోసపు రెడ్డి అని ఎద్దేవా చేశారు. జగన్ ఏపీలో యువతను కూడా ఉద్యోగ ఉపాధి పేరిట మోసం చేశాడని తెలిపారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్ వాస్తవానికి రాయలసీమకు పట్టిన శని అని లోకేశ్ అభివర్ణించారు. హంద్రీనీవా పూర్తి చేయలేదని, అమరరాజాను పక్కరాష్ట్రానికి పంపించేశాడని అన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి రాయలసీమకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని, ఒక సాగునీటి పథకం గానీ, ఒక తాగునీటి పథకం కానీ పూర్తి చేశాడా అని ప్రశ్నించారు.

గంజాయిలోనూ, శాండ్, లాండ్, వైన్, మైన్, అప్పుల్లో రాష్ట్రాన్ని జగన్ నెంబర్ వన్ చేశారని ఇటీవల తనను కలిసిన వైసీపీ నేత చెప్పాడని లోకేశ్ వెల్లడించారు.బాబాయ్ ని చంపింది అబ్బాయేనని, అందుకే సీబీఐ రా అంటూ పిలుస్తోందని, సీబీఐ పిలవగానే జగన్ ఢిల్లీ వెళతాడని విమర్శించారు. ఏపీ హక్కులపై, ప్రత్యేక హోదాపై ఏనాడైనా ప్రశ్నించాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ ని చంపిన వాళ్లను క్రిమినల్ అంటారని, ఆ క్రిమినల్ ఇప్పుడు జిల్లాకొక క్రిమినల్ ను తయారుచేశాడని అన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మంత్రి పెద్దిరెడ్డిని కూడా టార్గెట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version