జమ్మూకాశ్మీర్ ఎన్నికలపై మల్లికార్జున ఖర్గే సంచలన ట్వీట్..!

-

జమ్మూ కాశ్మీర్ లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మోడీ అండ్ కంపెనీకి ఎగ్జిట్ డోర్ చూపెట్టేందుకు జమ్మూ కాశ్మీర్ యువత సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాశ్మీర్ యువతను బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు.

కాశ్మీర్ లో యువత నిరుద్యోగ రేటు మార్చిలో 28.2 శాతంగా ఉంది. అనేక పరీక్ష పత్రాల లీక్ లు, విపరీతమైన అవినీతి కారణంగా నాలుగేళ్లుగా పలు విభాగాల్లో నియామకాలు ఆలస్యం అయ్యాయి. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో 65 శాతం పోస్టులు 2019 నుంచి ఖాళీగా ఉన్నాయి. దాదాపు 60వేల మంది ప్రభుత్వ దినసరి కూలీలుగా 15 ఏళ్ల నుంచి శ్రమిస్తున్నారని.. వారు రోజుకు రూ.300 మాత్రమే సంపాదిస్తున్నారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని బీజేపీ హామి ఇచ్చిందని.. కానీ పెద్ద తయారీ యూనిట్లు ఒక్కటి కూడా నెలకొల్పలేదని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version