కడప సెంట్రల్ జైల్లో కరోనాతో ఖైదీ మృతి..

-

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయే తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. కడప జిల్లాలో మొన్న 755 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క జిల్లా సెంట్రల్ జైల్‌లోనే 317 కేసులు నమోదవ్వడం సంచలనం రేపింది. మొత్తం 700 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా 317 మందికి పాజిటివ్‌ అని తేలింది.

ap-corona
ap-corona

ఆరోజునే వీరందర్నీ జైల్లోనే ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు కూడా. అయితే తాజాగా సెంట్రల్ జైల్లో కరోనాతో లింగన్న( 56) అనే ఖైదీ మృతి చెందాడు. ఇది కడప కారాగారంలొ తొలి మరణంగా చెబుతున్నారు. మృతుడుది కర్నూలు జిల్లాగా గుర్తించారు. ఒక హత్యకేసులో జీవిత ఖైదీగా లింగన్న శిక్ష అనుభవిస్తున్నారు. ఇక ఇదే జైల్లో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ప్రభాకర్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఆయన్ను ఈరోజు విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news