టిడిపి నేత వర్ల రామయ్య ను కలిసిన మందకృష్ణ మాదిగ

-

విజయవాడలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అంశం ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లోనే ఉందని.. దీనిపై చంద్రబాబు చొరవ తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్యని మందకృష్ణ కోరారు. మహానాడు లో ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారానికి టీడీపీ తీర్మానం చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ పట్ల వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉందని మందకృష్ణ ఆరోపించారు.

మాదిగలకు అన్యాయం జరిగిందని ఎన్టీఆర్ మొదట గుర్తించారని.. ఆ తర్వాత కొనసాగింపుగా చంద్రబాబు వ్యవహరించారని మందకృష్ణ వెల్లడించారు. చంద్రబాబు వల్లే వర్గీకరణ ఫలాలు మాదిగలకు దక్కాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబే ఎస్సీ వర్గీకరణపై చొరవ తీసుకోవాలని కోరారు. కాగా మందకృష్ణ ప్రస్తావించిన అంశాలను టీడీపీ పరిశీలిస్తోందని వర్ల రామయ్య హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news