టీ కాంగ్రెస్‌ నేతలకు వార్నింగ్‌ ఇచ్చిన మాణిక్కం ఠాగూర్‌

-

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ మరోసారి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను మందలించారు. గ‌తంలో స‌మ‌య పాల‌న పాటించాల‌ని వార్నింగ్ ఇచ్చిన ఠాగూర్‌..తాజాగా పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గాల‌ని హిత‌బోధ చేశారు. పార్టీలో విభేదాలపై మీడియాకు ఎక్కి ర‌చ్చ చేయొద్దంటూ ఆయ‌న నేత‌ల‌కు ఒకింత స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. బుధ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన పార్టీ చింత‌న్ శిబిర్ తొలి రోజు స‌మావేశంలో ఆయ‌న కీల‌కోప‌న్యాసం చేశారు మాణిక్కం ఠాగూర్‌.

Manickam Tagore - Wikipedia

ఈ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై వాడీవేడిగా చ‌ర్చ సాగ‌గా… ఏదైనా స‌మ‌స్య ఉంటే నాలుగు గోడ‌ల మ‌ధ్య చ‌ర్చించుకుని ప‌రిష్క‌రించుకోవాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచించిన మాణిక్కం ఠాగూర్‌.. అంతే త‌ప్పించి మీడియాకు ఎక్కి ర‌చ్చ ర‌చ్చ చేయ‌రాద‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. చ‌ర్చించుకున్నా స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతేనే… స‌మ‌స్య ఏదైనా త‌న దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు మాణిక్కం ఠాగూర్‌. ఈ త‌ర‌హా వ్య‌వ‌హారాల‌కు సంబంధించి పార్టీలో అంతా సెట్ అయ్యింద‌న్న ఠాగూర్‌… ఇంకా ఇద్ద‌రు, ముగ్గురే ఉన్నార‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మాణిక్కం ఠాగూర్‌.

Read more RELATED
Recommended to you

Latest news