జగన్‌ సర్కార్‌ మరో షాక్‌..సమ్మెకు దిగనున్న వైద్యా శాఖ ఉద్యోగులు

-

జగన్‌ సర్కార్‌ మరో షాక్‌ తగులనుంది. సాధారణ ఉద్యోగులతో పాటు తామూ సమ్మెకు వెళ్తామని చెబుతోంది వైద్యారోగ్య సిబ్బంది. పీఆర్సీ సాధ‌న స‌మితి పిలుపు మేర‌కు ద‌శ‌ల వారి ఉద్య‌మానికి ఏపి హెల్త్ అడ్మినిస్ట్రేష‌న్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ అసోసియేష‌న్( హంస‌) సంపూర్ణ మ‌ద్ద‌తు ప్రకటిస్తున్నట్లు ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేష‌న్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ అసోసియేష‌న్( ఏపి హంస‌) అధ్య‌క్షుడు అర‌వ పాల్ చెప్పారు. పీఆర్సీ జివోలు ర‌ద్దు చేయాలని.. చ‌ర్చ‌లు ముగిసే వ‌ర‌కు పాత జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Jagan
Jagan

11 పీఆర్సీ పై అశితోష్ మిశ్ర క‌మిటీ నివేదిక‌ను అమ‌లు చేయాలని.. ఈ పోరాటంలో డాక్ట‌ర్లు, న‌ర్సులు, పారామెడిక‌ల్ సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. దీని వల్ల క‌రోనా ,ఇత‌ర వైద్య సేవ‌ల‌కు కొంత అంత‌రాయం ఏర్ప‌డే అవ‌కాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెగ్యుల‌ర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు ఈ పోరాటంలో పాల్గొంటారని చెప్పారు. డిమాండ్లు ప‌రిష్కారం కాకుంటే అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల‌కు కూడా అంత‌రాయం ఏర్ప‌డే అవ‌కాశం ఉందని.. పెద్ద మ‌న‌సుతో అర్ధం చేసుకోవాల‌ని ఆశిస్తున్నామని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news