BREAKING : నేడు సీఎం జగన్‌ను కలవనున్న మెగాస్టార్‌ చిరంజీవి

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ, జగన్ సర్కార్ ల మధ్య టిక్కెట్ల ధరల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ల ధరలు పెంచాలని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ డిమాండ్ చేస్తూ ఉంటే… ఏపీ ప్రభుత్వం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే.. ఇటీవల టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రంగంలోకి దిగి.. ట్విట్టర్ వేదికగా… జగన్‌ సర్కార్‌ పై ప్రశ్నలను సంధించారు. అయినప్పటికీ… ఈ వివాదం కొలిక్కి రాలేదు.

ఇక వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ చేసిన బలిసి కొట్టుకుంటున్నారనే వ్యాఖ్యలు ఇంకా దుమారాన్నే లేపాయి. ఇలాంటి తరుణంలో… నేడు సీఎం జగన్‌ను కలవనున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. సీఎం జగన్‌తో కలిసి ఇవాళ లంచ్‌ చేయనున్నారు చిరంజీవి. సీఎం జగన్‌ను చిరంజీవి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో… సినిమా టికెట్ల వివాదంపై సీఎం జగన్‌ తో మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ మాట్లాడితే.. జగన్‌ ఎలా రియాక్ట్‌ అవుతారోనని అందరూ ఆలోచన చేస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news