ఇతర మతాలను కించపరిస్తే సహించేది లేదు: మంత్రి గంగులు

-

దేశంలో మత రాజకీయాలకు పాల్పడుతున్న వారిని తరిమి కొట్టేందుకు అల్లాను ప్రార్థించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచదేశాలు భారత్‌పై మండిపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ హజ్ యాత్రికులకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగులు కమలాకర్ హాజరై మాట్లాడారు.

మంత్రి గంగులు కమలాకర్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వ మతాలకు నిలయం భారతదేశమన్నారు. అలాంటి దేశంలో కొందరు మత రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇతర మతాలను కించపరిస్తే సహించేది లేదని మంత్రి గంగులు హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలకు సమానంగా చూస్తుందన్నారు. అన్ని మతాల పండుగలకు తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. కాగా, హజ్ యాత్రకు వెళ్లే వారికి వ్యాక్సినేషన్ అందించారు. వీరి ప్రయాణానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందన్నారు. కులమతాలకు అతీతంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version