మునుగోడు ప్రచారం.. మందు బాటిల్‌తో మంత్రి మల్లారెడ్డి దర్శనం..!

-

నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. తాజాగా మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో అన్ని పార్టీల నేతలు నామినేషన్లు వేయడానికి సిద్దం అవుతున్నారు.

ఈ క్రమంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ.. ఒక్కో ఊరుకు ఒక్కో ఎమ్మెల్యే చొప్పున వెళ్లి ప్రచారం చేస్తోంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఈ తరుణంలోనే.. మంత్రి మల్లారెడ్డికి చెందిన ఓ ఫోటో వైరల్‌ గా మారింది. ఆయన కొంత మందికి మందు పోస్తుండగా.. దానికి సంబంధించిన ఫోటో బయటకు వచ్చింది. దీంతో మల్లారెడ్డిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి అయి ఉండి, మునుగోడు ఓటర్లకు మందు పోస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అక్కడ మందు తాగే వాళ్లు, ఎవరనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news