ఉద్యోగితో చెప్పులు మోయించిన మంత్రి ఆర్కే రోజా..

-

ఏపీ మంత్రి రోజా.. ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తారు.. మొన్నటివరకూ ఏదో ఆడియో రికార్డింగ్‌ తెగ వైరల్‌ అయింది. ఇప్పటికే ఆంధ్రా రాజకీయాలు వేడక్కయాయి.. సొంతపార్టీ నాయకులో పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. నెల్లురూ ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.. ఈ క్రమంలో మంత్రి రోజా చేసిన పని ఇప్పుడు ఇంకా కొంపముంచేలా ఉంది. పర్యాటక మంత్రి రోజు బాపట్ల పర్యటనలో భాగంగా ఆమె చేసిన పనికి సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకరంగా విమ్మర్శల వర్షం కురుస్తుందనే చెప్పాలి. విపక్ష పార్టీల నేతలపై విరుచుకుపడే మహిళా మంత్రి బాపట్ల పర్యటనలో ఆమె ప్రవర్తించిన ఆమె తీరును ఎండగడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
బీచ్‌లో సరదాగా గడిపారు మంత్రి ఆర్కే రోజా. మంత్రి సముద్ర జలాల్లోకి వెళ్లినప్పటి నుంచి వచ్చే వరకు పర్యాటకశాఖలో హౌస్‌ కీపింగ్ ఉద్యోగి మంత్రి చెప్పులు పట్టుకొని నిలబడటం అక్కడ అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై మంత్రి అధికారదర్పంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడ్డ మంత్రి ఆర్కే రోజా గురువారం బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌ని సందర్శించారు. మినిస్టర్ వస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు, సిబ్బందులు ఆమెకు స్వాగతం పలికారు.
మంత్రి సముద్ర తీరాన్ని చూడగానే నీళ్లలోకి దిగారు. అయితే అదే సమయంలో ఆమె కాళ్లకు ఉన్న చెప్పులు విడిచారు. తన చెప్పులు తీసుకురమ్మని వెనుక ఉన్న ఉద్యోగులకు చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జబర్దస్త్‌ కామెడీ షోలో డ్యాన్స్‌లు చేసుకున్న ఈమెకు ఇంత బలుపెందుకని అందరూ కామెంట్స్ చేస్తున్నారు
అయితే మంత్రి కింది స్థాయి ఉద్యోగిని తన చెప్పులు మోయమని చెప్పారా లేక ..అతనే పట్టుకొని నిలబడ్డాడా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే వీడియో మాత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. రోజాపై విమర్శలు వర్షం కురుస్తుంది. ఏపీ మంత్రి ఆర్కే రోజా తీరును టీడీపీ నేతలు సైతం తప్పు పడుతున్నారు.
పర్యాటక శాఖ మంత్రి రోజా ఉద్యోగితో తన చెప్పులు మోయించడం ఏమిటి..? ఇంకా ఫ్యూడల్ భావజాలంలో నుండి బయటపడినట్లు లేరంటూ టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే అనిత ట్విట్టర్‌లో ఫోటోలు ట్యాగ్ చేసి విమర్శించారు.మంత్రి రోజా తీరుపై నెటిజన్లు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. కామెడీ షో చేసుకున్న రోజాకు మంత్రి పదవి ఇస్తే ఇలాగే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొన్ని కమెంట్స్‌ అయితే మాటల్లో చెప్పలే. ఇప్పటికే మంత్రి రోజాపై నియోజకవర్గంలోనే అసంతృప్తి నెలకొన్నట్లుగా వార్తలు ఉన్నాయి. దీనికి తోడు టీవీ షోలకు ఆమె గుడ్ బై చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి గెలుస్తారా లేక ..ఇలాంటి విమర్శల కారణంగా పరాజయం పాలవుతారా అనే సందేహం అందరిలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news